యాప్నగరం

ఏపీ ప్రజలకు షాక్.. పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు.. ఎంతెంతంటే..!

ఏపీ ప్రభుత్వం వాహనదారులకు షాకిచ్చింది. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేసింది.

Samayam Telugu 20 Jul 2020, 9:25 pm
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయానికి గండిపడింది. అయినా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ మంత్రాన్ని పాటిస్తూనే ఉన్నారు. ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నారు. ఓవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.
Samayam Telugu ఏపీలో పెట్రోల్ పంపు


Must Read: ఏపీలో కరోనా టెర్రర్: 24 గంటల్లో 54 మరణాలు.. ఆ ఒక్క జిల్లాలో వెయ్యికి పైగా కేసులు..

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ. 1.24, డీజిల్‌పై 93 పైసలు వ్యాట్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వ్యాట్‌ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనపు సుంకం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు రూ. 4 అదనంగా సుంకం విధించింది.

Also Read: వైసీపీ సర్కార్‌తో కాంప్రమైజ్ అంటే గొర్రె కసాయిని నమ్మినట్లే.. రాష్ట్రపతితో భేటీ కాబోతున్నా.. రఘురామ సంచలన స్టెప్..

లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ. 4,480 కోట్లుగా ఉన్న ఆదాయం.. 29.5 శాతానికి తగ్గి రూ. 1,323 కోట్లకు పడిపోయిందని వెల్లడించారు. జూన్ నెలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో పడిపోయిన రాష్ట్ర రెవెన్యూను పెంచుకోవడానికే ధరలు పెంచుతున్నామని భార్గవ్ తెలిపారు. ఇక, ప్రస్తుత వ్యాట్‌ పెంపు 2015-18 మధ్య వసూలు ప్రకారమే ఉందని పేర్కొన్నారు.

Must Read: ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. కొత్త మంత్రులు, ఎమ్మెల్సీలు వీరే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.