యాప్నగరం

వెనక్కి తగ్గేది లేదు.. ఈ నెలలోనే రైతుల అకౌంటర్లలో డబ్బు వేస్తామన్న జగన్ సర్కార్

ఏపీలో రైతుల ఖాతాల్లో ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకంపై ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.

Samayam Telugu 7 Sep 2020, 10:56 pm
రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ ఉచిత విద్యుత్ నగదు బదిలీకి ‘వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం’గా ప్రభుత్వం నామకరణం చేసింది.
Samayam Telugu రైతులతో సీఎం జగన్


శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత విద్యుత్ సబ్సిడీని ఆ జిల్లా రైతులకు నగదు బదిలీ రూపంలో ఈ నెలలోనే అందించనున్నట్లు తెలిపింది. కాగా, గతంలోనే ఈ పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రైతుల ఖాతాల్లోకే నగదు జమచేయంపై రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో విద్యుత్ సంస్కరణల విషయంలో ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, లేనిపోని అపోహలు సృష్టించవద్దని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతుల ఉచిత విద్యుత్‌కి ఎలాంటి విఘాతం కలగదన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని బాలినేని స్పష్టం చేశారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి వచ్చినా తన మంత్రి పదవి వదులుకుంటానని సవాల్ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.