ఏపీలో గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల (Ap Ward And Village Secretariat Employees)కు జగన్ సర్కార్ రెండు గుడ్న్యూస్లు చెప్పింది. సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులు గ్రేడ్-3ను గ్రేడ్-2కి మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కోరామన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. సీఎం కూడా అంగీకారం తెలిపారన్నారు. 11వేల మంది గ్రేడ్ 3 సర్వేయర్లను గ్రేడ్ 2లోకి మార్చేందుకు సానుకూలంగా స్పందించారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను వెంకట్రామిరెడ్డి సహా అధికారులు కలిశారు. గ్రామవార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు మార్చి, ఏప్రిల్ నెలలోనే చేసేందుకు అంగీకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎ బకాయిలు జనవరిలో ఇచ్చేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. లక్ష్మీ నారాయణ,సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘం నేత గ్రామ సర్వేయర్లు, వీఆర్వోల మధ్య గ్రేడ్ తేడా ఉందని సీఎంకు తెలిపామని.. సర్వేయర్లు, వీఆర్వోల మధ్య ఉన్న గ్రేడ్లను సరిచేయాలని కోరగానే సీఎం అంగీకరించారన్నారు. గ్రేడ్3 సర్వేయర్లను గ్రేడ్ 2 సర్వేయర్లుగా మార్చేందుకు సీఎం అంగీకరించారన్నారు. సీఎం నిర్ణయంతో 10 వేలమంది ఉద్యోగులకి లబ్ది చేకూరుతుందన్నారు.
గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను సెప్టెంబర్లోనే బదిలీలు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని సీఎంకు గుర్తు చేశామన్నారు. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు ఆగాయని.. ఏప్రిల్లో బదిలీలు చేస్తామని సీఎం తమకు హామీ ఇచ్చినట్లు ఉద్యోగసంఘ నేతలు తెలిపారు. గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లుగా మార్చేందుకు సీఎం అంగీకరించడంపై సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాదు ఇటీవల మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చనిపోయిన వారి బదులు ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలు చేపట్టనున్నారు. ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది.
కారుణ్య నియామకాలను రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా పూర్తి చేస్తారు. ఈ మేరకు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పూర్తిస్థాయిలో ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీం) పరిధిలోకి తీసుకొస్తోంది ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేశారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను సెప్టెంబర్లోనే బదిలీలు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని సీఎంకు గుర్తు చేశామన్నారు. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు ఆగాయని.. ఏప్రిల్లో బదిలీలు చేస్తామని సీఎం తమకు హామీ ఇచ్చినట్లు ఉద్యోగసంఘ నేతలు తెలిపారు. గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లుగా మార్చేందుకు సీఎం అంగీకరించడంపై సర్వే డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాదు ఇటీవల మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చనిపోయిన వారి బదులు ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలు చేపట్టనున్నారు. ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది.
కారుణ్య నియామకాలను రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా పూర్తి చేస్తారు. ఈ మేరకు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పూర్తిస్థాయిలో ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీం) పరిధిలోకి తీసుకొస్తోంది ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేశారు.
Read Latest Andhra Pradesh News and Telugu News