యాప్నగరం

YS Jagan సర్కారుకు బిగ్ రిలీఫ్: ఏకంగా రూ. 1,000 కోట్లు.. 5 రాష్ట్రాలతో పోటీ పడి మరీ ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రుణ సేకరణకు వెళ్లింది. ఈ సారి ఏకంగా 5 రాష్ట్రాల కంటే అధిక వడ్డీ కోట్ చేసి మరీ రూ. 1,000 కోట్లు..!

Samayam Telugu 9 Nov 2021, 5:15 pm
జగన్ ప్రభుత్వం మరోసారి రుణ సేకరణకు వెళ్లింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి మరో రూ. 1,000 కోట్ల రుణాన్ని సేకరించింది. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను పొందింది. ఈ వేలంలో మొత్తం 5 రాష్ట్రాలు పాల్గొనగా.. జగన్ ప్రభుత్వం అత్యధిక వడ్డీ 7 శాతం చెల్లించి మరీ రుణాన్ని సొంతం చేసుకుంది.
Samayam Telugu ఆర్బీఐ నుంచి జగన్ సర్కార్ రుణం


17 సంవత్సరాలకు రూ. 500 కోట్లు, 18 సంవత్సరాలకు మరో రూ. 500 కోట్లు రుణాన్ని సమీకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అదనపు రుణ పరిమితిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే మరోసారి అదనపు రుణ పరిమితి కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిన విషయం తెలిసిందే. క్రమంలో కేంద్ర ప్రభుత్వం అదనపు రుణ పరిమితి ఇవ్వకపోతే రాష్ట్రం మరింతగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొనక తప్పదని పలువురు పేర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.