AP Employees: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు.. శుభవార్త అందింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని.. మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. మంగళవారం కేబినెట్ సబ్ కమిటీతో.. ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో.. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని నిర్ణయించారు. 'ఉద్యోగ సంఘాలతో పెండింగ్ సమస్యలపై చర్చించాం. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. సుమారు రూ.3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తాం. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని నిర్ణయించాం' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) వ్యాఖ్యానించారు.
'ఉద్యోగులకు చెందిన పెండింగ్ క్లెయిమ్స్ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తాం. ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 లోపల చెల్లిస్తాం. అందరి ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు చేస్తాం. రిటైర్మెంట్ గ్రాట్యుటీ.. మెడికల్ ఎరియర్స్ అన్నీ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తాం' అని మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) స్పష్టం చేశారు. అయితే.. ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని.. ప్రభుత్వం చర్చలకు అహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
'ఉద్యోగులకు చెందిన పెండింగ్ క్లెయిమ్స్ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తాం. ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 లోపల చెల్లిస్తాం. అందరి ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు చేస్తాం. రిటైర్మెంట్ గ్రాట్యుటీ.. మెడికల్ ఎరియర్స్ అన్నీ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తాం' అని మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) స్పష్టం చేశారు. అయితే.. ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని.. ప్రభుత్వం చర్చలకు అహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
- Read Latest Andhra Pradesh News and Telugu News