యాప్నగరం

ఆఫ్గనిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు.. జగన్ సర్కారు కీలక నిర్ణయం!

ఆఫ్గనిస్థాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు ప్రజల కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హెల్ప్ లైన్ ప్రారంభించింది.

Samayam Telugu 21 Aug 2021, 5:38 pm
తాలిబన్‌ల ఆధీనంలో ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో ఇప్పుడు ప్రజలంతా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఆ దేశ పౌరులు ఎలాగైనా సరే ఆఫ్గన్ నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. చచ్చిపోతామని తెలిసినా.. విమానాల రెక్కలు, చక్రాలు పట్టుకుని దేశం దాటి వెళ్లిపోయేందుకు సాహసాలు చేస్తున్నారు. తాలిబన్ల దుర్మార్గమైన ఆంక్షల నడుమ నలిగిపోవడం కంటే.. చావుకు తెగించి అయినా సరే, అక్కడి నుంచి బయటపడాలని భావిస్తున్నారు.
Samayam Telugu ఆఫ్గనిస్థాన్లో చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం హెల్ప్ లైన్


ఆ దేశ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే.. ఉపాధి, వ్యాపార నిమిత్తం వెళ్లి ఆఫ్గనిస్థాన్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆఫ్గన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పౌరులు కూడా చిక్కుకుని పోయారు. ఈ క్రమంలో ఆఫ్గానిస్థాన్‌ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఆఫ్గన్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం కార్మిక శాఖలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ను ఏపీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగు వారు 0866-2436314, 7780339884, 9492555089 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలను తెలపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది.

ఇఖ, అఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గన్ ప్రజలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

వాట్సాప్ నంబర్లు: +91 8010611290; +91 9599321199; +91 7042049944

ఫోన్: +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.