యాప్నగరం

తల్లిదండ్రులకు శుభవార్త.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్‌ కింద 3,400 స్కూళ్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రీ స్కూల్స్‌కు అవసరమయ్యే సిలబస్ (పాఠాల) రూపకల్పనపైనా కసరత్తు మొదలు పెట్టారు.

Samayam Telugu 19 May 2020, 8:38 am
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ స్కూల్స్‌‌ను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. సమగ్ర శిక్ష అభియాన్‌ కింద 3,400 స్కూళ్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రీ స్కూల్స్‌కు అవసరమయ్యే సిలబస్ (పాఠాల) రూపకల్పనపైనా కసరత్తు మొదలు పెట్టారు. నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు ప్రీ స్కూల్స్‌లో అడ్మిషన్లు ఇస్తారు.
Samayam Telugu ఏపీ ప్రీ స్కూల్స్


ఈ ప్రీ స్కూల్స్‌లో ఏడాదిపాటు చదవడం, రాయడం వంటివి నేర్పిస్తారు. అలాగే స్పెషల్ టాలెంట్, గణిత పాఠాలు చెబుతున్నారు. ఆ తర్వాత విద్యార్థులు ఒకటో తరగతిలో చేరతారు. ఈ ప్రీ స్కూల్స్‌లో టీచర్లను కాంట్రాక్ట్ ప్రతిపాదికన తీసుకుంటారు. ఈ విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగడంతో పాటూ విద్యార్థులు చదువులో రాణిస్తారంటున్నారు అధికారులు. ఈ స్కూల్స్ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. మొదట గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మొత్తం అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.