యాప్నగరం

భక్తులకు శుభవార్త: శ్రీకాళహస్తి ఆలయంకు గ్రీన్ సిగ్నల్.. కానీ

కొన్ని నిబంధనల్ని పాటిస్తూ భక్తుల్ని ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు.

Samayam Telugu 12 May 2020, 11:27 am
కేంద్రం ఆదేశాలతో ఏపీలో లాక్‌డౌన్‌కు ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. వ్యాపారాలు, పరిశ్రమలు, షాపులకు జోన్లవారీగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదిలా ఉంటే శ్రీకాళహస్తి ఆలయం తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్ డౌన్ సడలించిన తర్వాత భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు ఈవో. కొన్ని నిబంధనల్ని పాటిస్తూ భక్తుల్ని ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నుండి భక్తులకు పూర్తి రక్షణ కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు.
Samayam Telugu శ్రీకాళహస్తి


ప్రత్యేక చర్యల్లో భాగంగా ప్రతి భక్తుడు మాస్క్ ధరించేలా చూస్తామని.. థర్మల్ స్క్రీనింగ్ గన్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. భక్తులు చేతులు శుభ్రపరచు కోవడానికి శానిటైజర్ లిక్విడ్ స్టాండ్ల ఏర్పాటు చేశామని.. ఆలయ ప్రాంగణము లోనికి ప్రవేశించే ప్రతి భక్తుడిని డిస్ ఇన్స్పెక్షన్ టన్నెల్ ద్వారా పంపి పిచికారి చేయిస్తామంటున్నారు. సామాజిక దూరం పాటించేలా క్యూలైన్లలో ఒక మీటరు దూరం.. ఒక రౌండ్ రింగును వేయడం, రాహు కేతు మండపంలో ఒక పీటకు ఒక పూజ టిక్కెట్ కూర్చో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, ఆలయ సిబ్బంది. లాక్‌డౌన్ సమయంలో శ్రీకాళహస్తి ఆలయానికి భక్తుల్ని అనుమతించడం లేదు. దాదాపు గత 50 రోజులుగా స్వామివారికి పూజలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆలయంలోకి భక్తుల్ని అనుమతించాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.