యాప్నగరం

జగన్ సర్కార్ కీలక ఆర్డినెన్స్.. తేడా వస్తే వేటు పడుతుంది

స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలపై గతంలో ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లో చట్ట రూపం దాల్చకపోవటంతో మళ్లీ ఆర్డినెన్సు జారీ చేసింది.

Samayam Telugu 5 Aug 2020, 10:10 am
పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు సంబంధించి జగన్ సర్కార్ ఆర్డినెన్స్ చేసింది. గతంలో చేసిన ఆర్డినెన్స్ కాల పరిమితి ముగియడంతో మళ్లీ ఆర్డినెన్స తీసుకొచ్చింది. ఆరు నెలల్లో చట్ట రూపం దాల్చకపోవటంతో మళ్లీ ఆర్డినెన్సు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలపై గతంలో ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వ్యవధిని 13 నుంచి 15 రోజులను కుదించారు.
Samayam Telugu జగన్ సర్కార్ ఆర్డినెన్స్


స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసిన అభ్యర్ధులపై అనర్హతా వేటు వేసేలా ఈ ఆర్డినెన్సులో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఆర్డినెన్సు కాలపరిమితి ముగియడంతో మరోమారు ఆర్డినెన్సు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్‌ను స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. అధికార పార్టీ ప్రతిపక్షాలు అభ్యర్థులు పోటీలో లేకుండా చేసేందుకు ఇలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆరోపించాయి. ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌ను వినిపించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.