యాప్నగరం

ఏపీలో మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్!

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి అది కాస్త ఇంకో ప్రమాదాన్ని తెచ్చేలా ఉన్నట్టు కనిపించింది.

Samayam Telugu 8 Aug 2020, 8:32 am
ఏపీలో మందుబాబులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది శానిటైజర్ తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్‌‌ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారట. ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది.
Samayam Telugu మందుబాబులకు గుడ్‌న్యూస్


Read Also: జగన్ సర్కార్‌‌కు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆమెకు లైన్ క్లియర్

ఈ కారణాలతో మద్యంపై కనీసం 30 నుంచి 40 శాతం మేర మద్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి అది కాస్త ఇంకో ప్రమాదాన్ని తెచ్చేలా ఉన్నట్టు కనిపించింది. శానిటైజర్ మరణాలు పెరుగుతుండటంతో ఆ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోందట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఏపీలో చిరు వ్యాపారులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.