యాప్నగరం

హంద్రీనీవా ప్రాజెక్టుకు మళ్లీ వైసీపీ ఎమ్మెల్యే తండ్రి పేరు

అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా పేరును మారుస్తూ ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ ప్రాజెక్టును అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా పిలవాల్సి ఉంటుంది.

Samayam Telugu 5 Jun 2020, 9:00 am
హంద్రీనివా ప్రాజెక్ట్‌కు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా పేరును మారుస్తూ ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ ప్రాజెక్టును అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా పిలవాల్సి ఉంటుంది.
Samayam Telugu హంద్రీనీవా


దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (2007లో) హంద్రీనీవా ప్రాజెక్టుకు 'అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు' అంటూ నామకరణం చేశారు. రాష్ట్రంలోని అనేక కరవు పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించాలంటూ మాజీ ఎంపీ, దివంగత నేత అనంత వెంకటరెడ్డి (ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఈయన తనయుడే) అనేక ఉద్యమాలు చేశారు. అందుకే ఆయన గౌరవార్థం హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు.

2007లో అనంత వెంకటరెడ్డి పేరు పెట్టినా.. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌ 2015లో ప్రాజెక్టుకు ఆయన పేరును తొలగించింది. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ పేరును మార్చి మళ్లీ పాత పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి జ్ఞాపకార్థం హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆయన పేరును పునరుద్ధరించడంపై.. అనంత వెంకటరెడ్డి తనయుడు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.