యాప్నగరం

పేదలకు జగన్ సర్కార్ శుభవార్త

లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత మార్చి 29 నుంచి ఇప్పటివరకు ఆరు విడతలుగా పంపిణీ. ఏడో విడత పంపిణీ ఈ నెల 3నుంచి ప్రారంభిస్తారు. ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయం.

Samayam Telugu 2 Jul 2020, 6:40 am
ఏపీలో పేదలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల మూడు నుంచి పేదలకు ఉచితంగా సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ కారణంగా పేదలు ఉపాధి కోల్పోవడంతో ఏడో విడత పంపిణీలో భాగంగా బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది. చక్కెరకు మాత్రం లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. పీఎం గరీభ్‌ కల్యాణ్‌ యోజన పథకంలో భాగంగా జులై నెల రేషన్‌ ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Samayam Telugu సీఎం జగన్


లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత మార్చి 29 నుంచి ఇప్పటివరకు ఆరు విడతలుగా పేదలకు బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేశారు. ఏడో విడత పంపిణీ ఈ నెల 3నుంచి ప్రారంభిస్తారు. బియ్యం కార్డులో పేర్లు నమోదైన ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారు. ఉచిత రేషన్‌ పంపిణీకి సంబంధించి రాష్ట్రానికి అదనంగా బియ్యం కేటాయించాలని కేంద్రానికి బుధవారం లేఖ రాసినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ అన్నారు. ఇక బియ్యంతో పాటు సబ్సిడీ సరుకుల కోసం రేషన్‌ డీలర్లు ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.