యాప్నగరం

తప్పుదిద్దుకున్న జగన్ సర్కార్.. మ్యాటరేంటంటే..!

ఎట్టకేలకు పార్టీ రంగుల విషయంలో జగన్ సర్కార్ తప్పుదిద్దుకుంది. సోషల్ మీడియాతో సహా అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకుంది.

Samayam Telugu 31 Oct 2019, 1:05 pm
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల భవనాలను అధికార పార్టీ రంగుల్లోకి మార్చేస్తున్న సంగతి తెలిసిందే. చివరికి శ్మశానాలనూ వదలకుండా వైఎస్సార్సీపీ రంగులు వేసేశారు. అందులో భాగంగా అనంతరపురం జిల్లాలో ఓ పంచాయతీ కార్యాలయానికి వైఎస్సార్సీపీ రంగులు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
Samayam Telugu pjimage (3)


అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామ సచివాలయానికి రంగులు వేస్తున్న వీడియో వైరల్ అయింది. సచివాలయ గోడపై ఉన్న జాతీయ జెండాను సైతం వదలకుండా పార్టీ రంగులు వేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదేనా మీ దేశభక్తి అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. విపక్ష నేతలు సైతం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read: సైబర్ కేటుగాళ్ల కొత్త రూటు.. కొరియర్ పేరుతో బురిడీ..

ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. ఆ ఘటన వైఎస్సార్సీపీ నేతల దేశభక్తికి.. జాతీయ పతాకం పట్ల వారికున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోందంటూ వీడియోను ట్వీట్ చేశారు. జాతీయ పతాకానికి కూడా పార్టీ రంగులు వేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జాతీయ జెండా రంగులపై పార్టీ రంగులు వేసిన ఘటనను సీరియస్‌గా తీసుకుంది. త్రివర్ణ పతాకంపై వేసిన వైసీపీ రంగులను తొలగించి భవనానికి తెలుపు రంగు వేయించింది. ఘటనకు బాధ్యుడిని చేస్తూ తమ్మడపల్లి పంచాయతీ కార్యదర్శి ఆర్.ప్రకాష్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.