యాప్నగరం

AP ZPTC Elections 2021: జగన్ సర్కారుకు బిగ్ షాక్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు!

AP Parishad Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఆర్టర్ ఇస్తూ తీర్పు వెలువరించింది.

Samayam Telugu 6 Apr 2021, 4:52 pm
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కారుకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలో రెండు రోజుల్లో జరగబోయే పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారించిన హైకోర్టు.. పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించిన నోటిఫికేషన్‌పై స్టే విధించింది.
Samayam Telugu ఏపీలో ఎన్నికలకు హైకోర్టు బ్రేక్


హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన ఎస్ఈసీ నీలం సాహ్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని తేల్చి చెప్పింది.

కాగా, ఇటీవలే నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు చేశారు. ఎస్ఈసీ నిర్ణయానికి నిరసనగా, తెలుగు దేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.