యాప్నగరం

జగన్ సర్కారుకు హైకోర్టు బిగ్ షాక్.. 4 వారాలే గడువు, వాటిని తొలగించాల్సిందే..!

రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు), సచివాలయాలు నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకు మళ్లీ షాక్ తగిలింది.

Samayam Telugu 31 Aug 2021, 5:31 pm
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరోసారి ఊహించని షాకిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు), సచివాలయాలు నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో ఆర్‌బీకేలు, సచివాలయాలు నిర్మించడంపై హైకోర్టులో విచారణ జరగగా, మొత్తం ఏడుగురు ఐఏఎస్‌ అధికారులు హాజరయ్యారు.
Samayam Telugu ఏపీ హైకోర్టు, సీఎం జగన్


పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలారావు, గతంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన విజయకుమార్, ఎంఎం నాయక్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,160 చోట్ల ఆర్‌బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లు అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే, మిగిలి నిర్మాణాల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. మిగిలిన నిర్మాణాలను కూడా 4 వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.