యాప్నగరం

జగన్ సర్కార్‌కు హైకోర్టు శుభవార్త

పోలవరం ప్రాజెక్ట్ పనులకు తొలగిన అడ్డంకులు. నవయుగ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ.. హైడల్ ప్రాజెక్ట్‌పై ఉన్న స్టేను ఎత్తేసిన కోర్టు. త్వరలోనే పనులు ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం.

Samayam Telugu 31 Oct 2019, 7:26 pm
పోలవరం ప్రాజెక్ట్ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. గురువారం హైడల్ ప్రాజెక్ట్‌పై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. విచారణలో ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్‌ పిటిషన్‌కు విలువ ఉండదని.. ఏజీ వాదనలతో కోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు ఎన్‌క్యాష్‌ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ను తప్పుబట్టి పక్కకు పెట్టింది.
Samayam Telugu high court


ఏపీ ప్రభుత్వం కొత్త కాంట్రాక్టరుతో ఒప్పందం చేసుకునేందుకు అవకాశం హైకోర్టు అవకాశం కల్పించింది. అలాగే నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారణను కూడా పూర్తి చేసింది. మొన్నటి వరకు నవయుగ సంస్థ హైకోర్టులో వేసిన పిటిషన్‌‌తో కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి.. హైకోర్టు తీర్పుతో పోలవరం ప్రాజెక్ట్ పనులకు అడ్డం తొలగిపోయింది. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి.

హైడల్ ప్రాజెక్ట్ విషయంలో ఒప్పందాన్ని ఏపీజెన్‌కో ఏకపక్షంగా రద్దు చేసుకుందని నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రాజెక్ట్ విషయంలో స్టే విధించిన హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. గురువారం తీర్పును ప్రకటించడంతో ప్రాజెక్ట్ పనులకు లైన్ క్లియ్ అయ్యింది. కొద్ది రోజుల క్రితమే జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రివర్స్ టెండరింగ్ చేపట్టింది. ఈ పద్దతి ద్వారా రూ. 850 కోట్లు ఆదా చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.