యాప్నగరం

ఏపీలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కేరళ ఎక్స్‌ప్రెస్

ఏపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Samayam Telugu 16 Nov 2019, 11:02 pm
కాచిగూడ రైలు ప్రమాదం మరువక ముందే ఏపీలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌ చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Samayam Telugu 11IN-KERALAEXPRESS


Also Read: కాచిగూడ రైలు ప్రమాదం: లోకోపైలట్ చంద్రశేఖర్ గుండెపోటుతో మృతి

ప్రమాద విషయం తెలుసుకున్న రేణిగుంట రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన బయలుదేరి ప్రమాద ఘటన స్థలికి సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు రైళ్ల ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.