యాప్నగరం

జగన్ సర్కారుకు బిగ్ షాక్: ఆ అర్హత కోల్పోయిన ఏపీ.. తెలంగాణకు శుభవార్త!

జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అదనపు రుణానికి సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది.

Samayam Telugu 12 Nov 2021, 7:22 pm
జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదనపు రుణం పొందేందుకు అర్హత కోల్పోయిందని పేర్కొంది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడినట్లు కేంద్ర పేర్కొంది. రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిందని.. దీంతో అదనపు రుణాన్ని ఏపీ పొందలేకపోయిందని వివరించింది.
Samayam Telugu సీఎం జగన్


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎంకు అదనంగా రూ. 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.5392 కోట్ల అదనపు రుణం పొందేందుకు అనుమతి లభించింది. అదనపు రుణం పొందేందుకు అర్హత పొందిన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం అదనపు రుణం పొందేందుకు అర్హత కొల్పోయింది.


కాగా, ఇటీవలే మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రుణ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మూలధన వ్యయంలో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ 15 శాతం టార్గెట్‌ పూర్తి చేసింది. దీంతో ఏపీకి రూ.2,655 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

జీఎస్‌డీపీలో నాలుగు శాతం నిక‌ర రుణాల ప‌రిమితిపై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహ‌కం ఇచ్చింది. అయితే, రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సర్కారు.. అదనపు రుణం సమీకరించుకునే అర్హత కోల్పోవడం ఇబ్బందికర పరిస్థితేనని పలువరు విశ్లేషిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.