యాప్నగరం

ఏపీ పోలీసులకు జాతీయ స్థాయి అవార్డుల పంట.. సరికొత్త రికార్డ్

కేవలం 11 నెలల వ్యవధిలోనే ఏకంగా 108 జాతీయ అవార్డులను దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడంలో 11 నెలల వ్యవధిలో ఇది మూడోసారి అన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్.

Samayam Telugu 3 Dec 2020, 7:55 am
ఏపీ పోలీసులకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్‌ గ్రూప్‌ జాతీయస్థాయిలో 18 అవార్డులు ప్రకటించగా.. వాటిలో ఏకంగా ఐదు అవార్డులను దక్కించుకుంది. కేవలం 11 నెలల వ్యవధిలోనే ఏకంగా 108 జాతీయ అవార్డులను దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా అవార్డులు దక్కించుకున్న వాటిల్లో సైబర్‌ మిత్రతో పాటు అందుబాటులో అఫెండర్‌ సెర్చ్‌, మహిళల భద్రత కార్యక్రమాల అమలులో విజయనగరం జిల్లా.. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో నిందితుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన ‘సువిధ’ కార్యక్రమం అమలులో అనంతపురం జిల్లాకు అవార్డ్ దక్కింది. టెక్నాలజీలో పోలీస్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ‘ప్రాజెక్ట్‌ టాటా’ కార్యక్రమం అమలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్‌ యంత్రాంగం స్కోచ్‌ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ అవార్డుల్లో సైబర్‌ మిత్ర, ప్రొజెక్ట్‌ టాటా కార్యక్రమాలు రజత పతకాలు సాధించాయి.
Samayam Telugu ఏపీ పోలీసులకు అవార్డులు


పోలీస్ శాఖకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నందుకు ప్రశంసించారు.ఏపీ పోలీస్‌ శాఖ దేశానికే ఆదర్శంగా పనిచేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడంలో 11 నెలల వ్యవధిలో ఇది మూడోసారి అన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇన్ని అవార్డులు సొంతం చేసుకోవడం గర్వకారణమని.. ఇప్పటి వరకు ఏపీ పోలీస్‌ శాఖ సాధించిన వాటిల్లో రెండు స్వర్ణ, 13 రజత పతకాలు ఉన్నాయి. మహిళలు ఏ సమస్య వచ్చినా వాట్సాప్‌ నంబర్‌ 91212 11100కు, డయల్‌ 112, 181, 100కు ఫోన్‌ చేసే చెప్పేలా పోలీస్‌ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలను అమలు చేస్తోందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.