యాప్నగరం

ఏపీలో మరో 15 కరోనా కేసులు.. ఒక్క జిల్లాలోనే 11 కేసులు; రెండు మరణాలు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 363కి చేరింది. మరణాల సంఖ్య ఆరుకు పెరిగింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 కేసులను గుర్తించారు.

Samayam Telugu 10 Apr 2020, 12:03 am
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో ఒకరు చనిపోగా.. గుంటూరులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది. మరోవైపు రాష్ట్రంలోని కోవిడ్ బాధితుల సంఖ్య 363కు చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో ఒకర్ని డిశ్చార్జ్ చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 10కి చేరింది.
Samayam Telugu corona india4


గురువారం ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కేసులు నమోదు కాగా.. గుంటూరులో రెండు, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

జిల్లాల వారీగా చూస్తే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. ఇక్కడ 51 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. నెల్లూరు (48), ప్రకాశం (38), క్రిష్ణా (35) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు.

Read Also: గుంటూరులో మరో కరోనా కేసు.. మున్సిపల్ ఆఫీసులో కలకలం

Read Also: లాక్‌డౌన్ రూల్స్ మంత్రులకు వర్తించవా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.