యాప్నగరం

షాకింగ్: ఏపీలో ఒక్క రోజే 108 మంది మృతి.. ఈ జిల్లాలో కరోనా టెర్రర్!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం రేపుతోంది. మంగళవారం ఒక్క రోజే 108 మంది మరణించారు.

Samayam Telugu 11 May 2021, 5:10 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తోంది. కరోనా వైరస్ కేసులు, మరణాల తీవ్రత మరింతగా పెరిగింది. ఒక్క రోజే 20 వేలకు పైగా కేసులు, 100కు పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం బులెటిన్‌లో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 86,878 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 20,345 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 707 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 13,22,934కి చేరింది.
Samayam Telugu కరోనా మరణాలు (ప్రతీకాత్మక చిత్రం)


ఇక, గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ చికిత్స పొందుతూ 108 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 మంది, విశాఖపట్నంలో 12, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున, ప్రకాశంలో 9, నెల్లూరు 8, కృష్ణా 7, శ్రీకాకుళం 6, అనంతపురం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 8,899కి చేరింది.

ఇక, ఒక్క రోజు వ్యవధిలో 14,502 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,75,14,937 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,95,102 యాక్టివ్‌ కేసులున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.