యాప్నగరం

ఏపీలో కరోనా టెర్రర్: ఒక్క రోజే 98 మంది మృతి.. కేసులు 22 వేలకు పైగా.. ఈ జిల్లాలో భారీగా!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. ఒక్క రోజే కరోనా కేసులు 22 వేలకు పైగా నమోదయ్యాయి.

Samayam Telugu 15 May 2021, 7:49 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు, దాదాపు వంద మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం సైతం కరోనాతో బాధపడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 98 మంది మృతి చెందారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Samayam Telugu కరోనా వైరస్‌తో మరణించిన వ్యక్తిని తీసుకెళ్తున్న సిబ్బంది (ఫైల్)


గడిచిన 24 గంటల్లో 89,535 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 22,517 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో, తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 14,11,320 మంది వైరస్‌ బారినపడ్డారు.

అలాగే కరోనాతో బాధపడుతూ ఒక్క రోజే 98 మంది కన్నుమూశారు. కోవిడ్‌తో బాధపడుతూ గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 12 మంది మృతి చెందగా, నెల్లూరులో 11, తూర్పు గోదావరిలో 10, విశాఖపట్నంలో 9, విజయనగరంలో 9, చిత్తూరులో 8, శ్రీకాకుళంలో 8, గుంటూరులో 7, పశ్చిమ గోదావరిలో 7, కృష్ణాలో 5, కర్నూలులో 5, ప్రకాశంలో 5, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

తాజాగా 18,739 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డ వారి సంఖ్య 11,94,582కు చేరింది. అలాగే, గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరిలో అత్యధికంగా 3,383 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 992 మంది కరోనా బారిన పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.