యాప్నగరం

జగన్ సర్కార్‌కు మరో ట్విస్ట్ ఇచ్చిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. తెరపైకి కొత్త జిల్లాల లాజిక్

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించింది. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

Samayam Telugu 17 Nov 2020, 11:48 am
జగన్ సర్కార్‌కు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ట్విస్ట్ ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని.. అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం సరికాదని లేఖలో ప్రస్తావించారు. 13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టామని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు 13 జిల్లాలే ఉండాలని.. లేనిపక్షంలో జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే వరకు జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దని లేఖలో ప్రస్తావించారు.
Samayam Telugu andhra pradesh sec nimmagadda ramesh kumar writes letter to cs neelam sahni over new districts formation
జగన్ సర్కార్‌కు మరో ట్విస్ట్ ఇచ్చిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. తెరపైకి కొత్త జిల్లాల లాజిక్


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించింది. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేసి.. మొత్తం 26 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించారు. 32 జిల్లాల వరకు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. జిల్లాల విభజనపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.