యాప్నగరం

రిపబ్లిక్ డే.. ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం

Republic Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. కోనసీమలో ప్రబల తీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఏర్పాటైన శకటాన్ని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీ అధికారులు. ఇటు సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవకాశం వచ్చింది. తెలంగాణకు ఇందులో చోటు దక్కలేదు. అయితే.. శకటాల ఎంపిక విషయం నిపుణుల కమిటీ మాత్రమే నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 11 Jan 2023, 11:56 am

ప్రధానాంశాలు:

  • రిపబ్లిక్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక
  • కోనసీమలో ప్రబల తీర్థం పేరుతో ఏపీ శకటం
  • కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Republic Day
రిపబ్లిక్ డే
Republic Day: జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. ఈ విషయంపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాలకు అవకాశం వచ్చింది. తెలంగాణ (Telangana)కు చోటు దక్కలేదు.
గతేడాది తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి లభించలేదు. 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించింది. వాటిలో అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ శకటాలు మాత్రమే ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాలకు చెందిన శకటాలకు అనుమతి లభించలేదు. అంతకు ముందు ఏడాది ఏపీకి ఛాన్స్ వచ్చినా.. తెలంగాణకు రాలేదు.

2021లో నిర్వహించిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్.. లేపాక్షి (Lepakshi) ఆలయం శకటాన్ని ప్రదర్శించింది. 2015లో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ శకటం రిపబ్లిక్ పరేడ్‌లో అవకాశం దక్కించుకొంది. 2020లో సమ్మక్క-సారలమ్మ దేవతల శకటం ప్రదర్శనకు అనుమతి దక్కింది. 2015, 2020, 2021లలో ఏపీ రాష్ట్రానికి చెందిన మూడు శకటాలకు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. శకటాల ఎంపిక విషయం నిపుణుల కమిటీ మాత్రమే నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం పాత్ర లేదని స్పష్టం చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.