యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్: నేటి నుంచే కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ.. వీళ్లకు మాత్రమే..!

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది.

Samayam Telugu 21 Apr 2021, 11:51 pm
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి కరోనా వైరస్ వ్యాక్సినేషన్ రెండో డోస్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో 5 లక్షల కొవిషీల్డ్‌, లక్ష కొవాగ్జిన్‌ డోసులను జిల్లాలకు సరఫరా చేసినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ భాస్కర్‌ తెలిపారు. మొదటి డోస్‌ తీసుకున్న వారు తప్పకుండా గురువారం నుంచి రెండో డోస్‌ తీసుకోవాలని ఆయన సూచించారు. బుధవారం అందరికీ కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‌ మాత్రమే ఇస్తారని.. మొదటి డోస్‌ ఇవ్వరనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
Samayam Telugu కరోనా వ్యాక్సిన్ (ప్రతీకాత్మక చిత్రం)


ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 39,619 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,716 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9,86,703 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే కరోనా మహమ్మారి బారిన పడి బుధవారం ఒక్క రోజే 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.