యాప్నగరం

ఏపీలో కొత్త మంత్రుల శాఖలివే.. మరో ఇద్దరి శాఖల్లో మార్పులు

ఏపీలో నూతన మంత్రులకు శాఖలు కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు మత్స్య శాఖ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖలు అప్పగించారు.

Samayam Telugu 22 Jul 2020, 11:10 pm
ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రి పదవి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ పోర్టుపోలియో అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దే ఉంది. తాజాగా, ఈ శాఖలకు ధర్మాన కృష్ణదాస్‌కు కేటాయించారు.
Samayam Telugu ఏపీ కొత్త మంత్రులు


అలాగే ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్‌ నారాయణకు కేటాయించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ తప్పుకోవడంతో సీఎం జగన్ దగ్గరే ఉన్న మత్స్య, పశుసంవర్థక శాఖ బాధ్యతలను సీదిరి అప్పలరాజుకు అప్పగించారు.

శంకర్‌ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మంత్రివర్గంలో మార్పులివే.. ధర్మాన కృష్ణదాస్‌ - ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్
సీదిరి అప్పలరాజు- మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
మాలగుండ్ల శంకర్ నారాయణ - రోడ్లు, భవనాలు
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.