యాప్నగరం

లాంగ్ లీవ్‌లో సీనియర్ ఐపీఎస్.. జగన్ సర్కార్‌పై అలక!

ఈ ఏడాది మార్చి 4 నుంచి వచ్చే ఏడాది జూలై 31 వరకు లాంగ్ లీవ్‌పై వెళుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం. వ్యక్తిగత పనులపై అమెరికా వెళుతున్నట్లు.. సెలవు కావాలని కోరారు.. అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.

Samayam Telugu 29 Feb 2020, 3:28 pm
ఏపీ సీనియర్ ఏపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ బాలసుబ్రహ్మణ్యం లాంగ్ లీవ్‌పై వెళ్లారు. అమెరికా వెళ్లేందుకు ఆయన ఏడాదిపైనే సుధీర్ఘంగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది మార్చి 4 నుంచి వచ్చే ఏడాది జూలై 31 వరకు (515 రోజులు) వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లేందుకు అనుమతి కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా లాంగ్ లీవ్‌కు అనుమతి ఇచ్చింది.
Samayam Telugu balu


గత ప్రభుత్వంలో రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇటీవల రైల్వే డీజీగా నియమించింది. తనకు ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులో నయమించారనే అసంతృప్తితో ఉన్నారట. అందుకే లాంగ్ లీవ్‌పై వెళుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా సెలవు మంజూరు చేయడం ఆసక్తికరంగా మారింది.

మూడు నెలల క్రితం సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా లాంగ్ లీవ్‌లో ఉన్నారు. సీఎస్ పదవి నుంచి తప్పించి.. ఆయన్ను బాపట్ల ఎన్‌హెచ్‌ఆర్డీఐకి బదిలీ చేశారు. దీంతో ఆయన కూడా తనకు ప్రాధాన్యం లేని పోస్టు రావడంతో కినుక వహరించారు. అందుకే లాంగ్ లీవ్‌పై వెళ్లినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. తాజాగా మరో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం సుధీర్ఘ సెలవుపై వెళ్లడం ఆసక్తిరేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.