యాప్నగరం

ఏపీ కరోనా అలర్ట్: మరో 12 పాజిటివ్.. ఆ ఒక్క జిల్లాలో 90కేసులు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 12 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు పెరిగింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 90 కేసులు.

Samayam Telugu 23 Apr 2020, 3:13 pm
ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారంరాత్రి 10 గంటల నుంచి.. సోమవారం ఉదయం 10 గంటల వరకు నమోదైన కోవిడ్19 పరీక్షల్లో.. మరో 12 కేసులు బయటపడ్డాయి. వీటిలో గుంటూరు జిల్లాలో 8, చిత్తూరు 2.. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో ప్రకటించారు. ఈ 12 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు పెరిగింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.
Samayam Telugu coronavirus


Also Read: ఏపీ: వార్డ్ వాలంటీర్‌కు కరోనా పాజిటివ్.. అక్కడ హైలర్ట్

రాష్ట్రంలో కేసుల్లో గుంటూరు జిల్లా టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Read Also:
దగ్గుబాటివారి ఘుమఘుమలు.. దమ్ బిర్యానీ, చికెన్ అదిరింది!

Don't Miss: మందుబాబులకు జగన్ సర్కార్ కీలక సూచనలు

జిల్లాలవారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా - 90
కర్నూలు జిల్లా - 84
నెల్లూరు జిల్లా - 52
ప్రకాశం జిల్లా - 41
కృష్ణా జిల్లా -36
కడప జిల్లా - 31
పశ్చిమ గోదావరి జిల్లా - 23
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా - 23
తూర్పుగోదావరి జిల్లా - 17
అనంతపురం జిల్లా -15
మొత్తం కేసులు -432
(గమనిక: ఈ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 12మందికి ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.