యాప్నగరం

కర్నూలు: నలుగురి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

పోలీసులు తనకు చోరీ కేసును అంటగట్టారని.. చోరీ కేసుకు తనకు సంబంధం లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన. తన కుటుంబానికి సాయం చేసేవారెవరూ లేరు అన్నారు.

Samayam Telugu 7 Nov 2020, 10:11 am
కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు కుటుంబ పెద్ద అబ్దుల్ సలాం తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడింది. పోలీసులు తనకు చోరీ కేసును అంటగట్టారని.. చోరీ కేసుకు తనకు సంబంధం లేదు అన్నారు. తన కుటుంబానికి సాయం చేసేవారెవరూ లేరు అన్నారు. దొంగతనం కేసు అంటగట్టడంతోనే అబ్ధుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. కర్నూలు జిల్లా మూల సాగరానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu ఆత్మహత్య కేసులో ట్విస్ట్


కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని కౌలూరు దగ్గర ఈ నెల 3న రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. గతంలో సలాం ఓ బంగారం దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. షాపులో మూడు కేజీల బంగారం దొంగతనం చేశాడంటూ సలాంపై గతేడాది నంద్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఒత్తిడి చేయడంతో సలాం మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. కేసు విచారణ జరుపుతున్న సీఐ దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలంటూ సలాంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.