యాప్నగరం

ఏపీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి

ముందుగా స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆడియో స్పీకర్ నుండి పొగలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెక్యురిటి సిబ్బంది పరిస్థితిని సమీక్షించి సరిచేశారు.

Samayam Telugu 15 Aug 2020, 10:05 am
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో మరో అపశృతి దొర్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఆయన పోడియంను అనుకొని ఉన్న మీడియా గ్యాలరీ(ఏ ఏ)లో ఏర్పాటు చేసిన ఏసీ నుండి పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏసీకి పవర్ సప్లైను కట్ చేశారు. అంతకుముందు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆడియో స్పీకర్ వద్ద కూడా షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆడియో స్పీకర్ నుండి పొగలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెక్యురిటి సిబ్బంది పరిస్థితిని సమీక్షించి సరిచేశారు.
Samayam Telugu ఏపీ సీఎం జగన్
ap cm jagan


ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. అక్కడ భద్రత బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను ఆయన వీక్షించారు. రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో వైద్య, ఆరోగ్య సేవలపై శకటాలను ప్రదర్శించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనం అన్నారు. ప్రతీ పౌరుడు దేశ భక్తిని పెంపొందించుకోవాలన్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి, చేనేతకు చేయూత వంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. కులం, మతం పార్టీలకు అతీతంగా పథకాల అమలు జరగాలన్నారు. ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతీవారికి ఆరోగ్య శ్రీ వర్తిస్తుందన్నారు.
Read More: ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్షాలు.. మరింత బలపడనున్న అల్పపీడనం
అంతకుముదు ట్విట్టర్ ద్వారా జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతీయులకు ట్విటర్‌ ద్వారా విషెస్ అందించారు. ఈరోజు మనం ఆనందించే స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వీరులకు నా శతకోటి వందనాలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలను అర్పించి దేశ భక్తిని మరింత పెంపొందించారు. మన దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను రక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.. దాని పురోగతికి దోహదం చేద్దామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.