యాప్నగరం

YSRCP MLA Corona Positive: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. చెన్నై ఆస్సత్రిలో చేరిక

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనారోగ్యంగాతో టెస్ట్ చేయించుకోగా వైరస్ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తున్నారు.

Samayam Telugu 14 Jul 2020, 11:24 am
ఏపీని కరోనా వణికిస్తూనే ఉంది. సామాన్య ప్రజలు, కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులను వెంటాడుతోంది. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా టెన్షన్ పెడుతోంది. కొంతమంది మంత్రులు, వారి కుటుంబాలు.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలామంది ఈ వైరస్ బారినపడ్డారు. కొంతమందికి కోలుకుంటుండగా.. మరికొంతమంది కొత్తగా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు కరోనా నిర్థారణైంది.
Samayam Telugu వైసీపీ ఎమ్మెల్యే


సూళ్లూరుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనారోగ్యంగాతో టెస్ట్ చేయించుకోగా వైరస్ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నట్లు సమాచారం. చెన్నూ సూళ్లూరుపేటకు దగ్గర కావడంతో ఆయన అక్కడి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో ప్రజా ప్రతినిధుల మాత్రమే కాదు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వెంకటగిరిలో ఓ పోలీస్ స్టేషన్‌కూడా కరోనా వైరస్ కారణంగా మూతపడింది. అంతేకాదు పలువురు వైద్య సిబ్బందికి కూడా ఈ వైరస్‌ సోకింది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనాలు వణికిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.