యాప్నగరం

వరదలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెల 27న!

YS Jagan: వరదలో నష్టపోయిన రైతులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇన్‌పుట్ సబ్బీడీ చెల్లించబోతున్నట్లు ప్రకటించింది.

Samayam Telugu 24 Oct 2020, 8:38 pm
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ నెల 27న ఇన్‌పుట్‌ సబ్సీడీ అందింస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులకు చరిత్రలో ఎన్నడూ ఇంత త్వరగా ఏ ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సీడీ ఇవ్వలేదన్నారు. రైతులను ఆదుకునేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
Samayam Telugu రైతులతో సీఎం జగన్


అలాగే ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీపై మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. వరదకు, వర్షానికి తేడా తెలియకుండా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు రూ. 2,000 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సీడీకి ఎగనామం పెట్టారని ఆరోపించారు. ఆ బకాయిలను కూడా సీఎం జగన్‌ రైతులకు అందించారని తెలిపారు.

టీడీపీ హాయాంలో రైతులకు రూ. 1,075 కోట్ల వడ్డీ లేని రుణాల మొత్తాన్ని ఎగనామం పెడితే తాము వచ్చాక చెల్లించామని మంత్రి కన్నబాబు చెప్పారు. చంద్రబాబు చేసిన పాపాలే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును వెంటాడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ పేరుతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను గందరగోళంలో పడేస్తే.. ఇప్పుడు అదే అంశాలను కేంద్ర ప్రభుత్వం చెప్తోందని మంత్రి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.