యాప్నగరం

ఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 18న బడ్జెట్

కరోనా వైరస్ కారణంగా వేసవిలో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలు త్వరగానే ముగించారు. ఆ సమయంలో కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశ పెట్టారు.

Samayam Telugu 7 Jun 2020, 11:50 am
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పాలన వ్యవస్థ సైతం ఇబ్బందులు పడుతోంది. కరోనా వైరస్‌కు భయపడి ప్రభుత్వాలు పలు అధికారిక కార్యక్రమలు కూడా వాయిదా వేసుకున్నాయి. వేసవిలో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల్ని కూడా ఎక్కువ రోజుల పాటు నిర్వహించకుండా కుదించాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ లాక్ మొదటి దశ కొనసాగుతోంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు సైతం పాలనలో ముందుకు పోతున్నాయి.
Samayam Telugu ఏపీ అసెంబ్లీ


తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో ఓటాన్‌ అకౌంట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. 18న బడ్జెట్ సభలో ప్రకటించనుంది ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం అవుతుందని తెలుస్తుండగా, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అది18న బడ్జెట్ చర్చ సభ ముందుకు రానుందని సమాచారం.

అంసెబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సభకు హాజరై ఉభయ సభల సభ్యులను ఉద్దే శించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే, బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశ మవుతుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనుంది. ఆపై 19 వ తేదీన ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్ని ముగించేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.