యాప్నగరం

ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల కన్నుమూత

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి అనారోగ్యం కారణంగా మరణించారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 16 Feb 2020, 4:31 pm
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి (87) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1933 డిసెంబర్ 28న చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో జన్మించారు. 1957లో తూకివాక గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1962లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆయన.. రెండోసారి తిరుపతి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Samayam Telugu agarala eswar reddy


1981-82లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. అనంతరం కొన్నాళ్లపాటు స్పీకర్‌గా పని చేశారు. 1983లో ఆయన ఎన్టీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన ఇటీవలే సమర్థించారు. కర్నూలులో హైకోర్టు, విశాఖలో రాజధాని ఉండటం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు అమరావతి కోసం జోలె పట్టుకొని తిరగడం సిగ్గుచేటన్నారు. ‘చంద్రబాబు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలను కొనగలడు. ఇంకా ఆయనకు జోలె ఎందుకు’ అని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాబు, అగరాల ఒకే జిల్లాకు చెందినప్పటికీ.. ఆయన టీడీపీకి వ్యతిరేకంగానే వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.