మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య
నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారని సమాచారం. వెంటనే ఆయన్ను బసవతారకం హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu 16 Sep 2019, 6:05 pm
అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు (72) కన్నుమూశారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్పందించిన సహాయకులు.. ఆయన్ను బసవతారకం హాస్పిటల్కు తరలించారు. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో.. ఆయన తుది శ్వాస విడిచారు. కొడెల మరణ వార్తను హాస్పిటల్ వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. కానీ బంధువులు, పార్టీ వర్గాలు మాత్రం ఆయన మరణవార్తను ధ్రువీకరించాయి. కోడెల పార్థీవ దేహాన్ని కాసేపట్లోనే నర్సరావు పేట తీసుకెళ్తారని సమాచారం.
Also Read: కోడెలది హత్యే.. కుమారుడే చంపించాడు: కోడెల బావమరిది సాయి పోలీసులకు ఫిర్యాదు
కోడెల శివ ప్రసాద రావుకు ఇటీవలే గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరులో కొద్ది రోజులపాటు తన అల్లుడికి చెందిన హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు.
అసెంబ్లీ ఫర్నీచర్ వివాదంలో పోలీసులు కోడెలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో కోడెల ట్యాక్స్ పేరిట నరసరావు పేట ప్రాంతంలో బలవంతంగా వసూళ్లు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన కుమార్తె, కుమారుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన మానసిక వేదనకు గురయ్యారు.
Read Also: తోబుట్టవుల మరణాన్ని తట్టుకోలేక డాకర్ట్గా.. కోడెల ప్రస్థానం ఇదీ..
కోడెల శివ ప్రసాద రావు మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Read Also: కోడెల మరణం.. కారణాలేంటి..? కొడుకుతో గొడవలా...?
Also Read: కోడెలది హత్యే.. కుమారుడే చంపించాడు: కోడెల బావమరిది సాయి పోలీసులకు ఫిర్యాదు
కోడెల శివ ప్రసాద రావుకు ఇటీవలే గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరులో కొద్ది రోజులపాటు తన అల్లుడికి చెందిన హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు.
అసెంబ్లీ ఫర్నీచర్ వివాదంలో పోలీసులు కోడెలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో కోడెల ట్యాక్స్ పేరిట నరసరావు పేట ప్రాంతంలో బలవంతంగా వసూళ్లు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన కుమార్తె, కుమారుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన మానసిక వేదనకు గురయ్యారు.
Read Also: తోబుట్టవుల మరణాన్ని తట్టుకోలేక డాకర్ట్గా.. కోడెల ప్రస్థానం ఇదీ..
కోడెల శివ ప్రసాద రావు మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Read Also: కోడెల మరణం.. కారణాలేంటి..? కొడుకుతో గొడవలా...?