యాప్నగరం

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ దూకుడు.. బాబుకు కష్టాలు తప్పవా!

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చ.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని తీర్మానం. స్వతంత్ర విచారణ సంస్థతో విచారణ చేయించాలని కోరిన కొందరు వైఎస్సార్‌సీపీ సభ్యులు.

Samayam Telugu 22 Jan 2020, 3:30 pm
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ సర్కార్ దూకుడు పెంచింది. విచారణ బాధ్యతలు లోకాయుక్తకు అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది. ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మూడో రోజు సభలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై తీర్మానం ప్రవేశపెట్టింది. హోంమంత్రి మేకతోటి సుచరిత తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి.. చర్చను ప్రారంభించారు.
Samayam Telugu babu


కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన ఆధారంగా 4,070 ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించాలని కొందరు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. సీబీఐ వంటి సంస్థతో దర్యాప్తు చేయిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. తీర్మానాన్ని సభలో ఆమోదించారు. త్వరలోనే ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఈ వ్యవహారంపై విచారణ చేసే బాధ్యతల్ని లోకాయుక్తకు అప్పగిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతకముందే ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై కేబినెట్ సబ్‌కమిటీ నివేదికను సమర్పించింది. దీంతో లోకాయుక్తతకు బాధ్యతలు అప్పగించింది. కానీ అసెంబ్లీలో స్వంతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ రావడం ఆసక్తిరేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.