యాప్నగరం

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కసరత్తు.. మళ్లీ తెరపైకి మూడు రాజధానుల బిల్లు!

Ap Assembly Session ఈ నెల మూడో వారంలో నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం. మరోసారి మూడు రాజుధానుల బిల్లు తెరపైకి వచ్చింది. ఈ నెల 7న కేబినెట్‌ భేటీలో ఫైనల్ చేస్తారా..

Authored byతిరుమల బాబు | Samayam Telugu 2 Sep 2022, 6:26 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AP Assembly Session
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి శాసనసభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో ఎజెండాను నిర్ణయించే అవకాశం ఉంది. గత నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా.. వాయిదా వేశారు. వారం పాటూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఓ వారం పాటూ సభను నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీనిపై 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ నెల 24 నుంచి శరన్నవరాత్రులు మొదలుకానుండటంతో ఆలోపే సమావేశాలు ముగిస్తారా అనే చర్చ జరుగుతోంద. 19 నుంచి 24 లోగా సమావేశాలు ముగిస్తారనే ప్రచారం నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.