యాప్నగరం

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు, ఎమ్మెల్యేలల్ని అడ్డుకున్న భద్రతా సిబ్బంది

Onion Prices| ఏపీలో అసెంబ్లీ సమావేశాల హీట్.. తొలిరోజు ఉల్లి దండలతో నిరసనలు తెలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి టీీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాళి.

Samayam Telugu 9 Dec 2019, 9:45 am
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రతిపక్షం టీడీపీ ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వినూత్నంగా నిరసన తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో ఉల్లిపాయ దండలతో అసెంబ్లీకి వచ్చారు.. ప్లకార్డులతో నిరసనను తెలిపారు. అసెంబ్లీ గేటు దగ్గర భద్రతా సిబ్బంది టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఉల్లి దండలు, ప్లకార్డులకు అనుమతి లేదన్నారు.. దీంతో పోలీసులతో టీడీపీ ఎమ్మెల్యేల వాగ్వాదం జరిగింది.
Samayam Telugu tdp.


అంతకముందు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఉల్లి ధరలపై వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు. అంతేకాదు ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెంపు అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రతిపక్షం టీడీపీ నిర్ణయం తీసుకుంది.

వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి మొత్తం 21 అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల, అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పనులను ప్రభుత్వం నిలిపివేయడంపై సభలో గళమెత్తేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలల సమయం అయిపోయినందున ఇప్పుడు ప్రభుత్వ పనితీరుపై గట్టిగా నిలదీయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.