యాప్నగరం

టీడీపీ ఎమ్మెల్యేేలను సస్పెండ్ చేస్తే నాకు నిద్ర కూడా పట్టదు.. స్పీకర్ తమ్మినేని షాకింగ్ కామెంట్స్

ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో గత నాలుగు రోజులుగా వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. సభలో వాళ్లు తమ వాదనలు వినిపించుకోవచ్చని.. నియమ నిబంధనలకు లోబడి.. సభ సంప్రదాయాలను పాటించాలన్నారు.

Samayam Telugu 4 Dec 2020, 1:28 pm
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కూడా వాడీ-వేడిగా జరిగాయి. టీడీపీ ఉపాధి హామీకి సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సభను అడ్డుకుంది.. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.. తిరిగి సభ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో పదిమంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో స్పీకర్ తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu తమ్మినేని సీతారాం


ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో గత నాలుగు రోజులుగా వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. సభలో వాళ్లు తమ వాదనలు వినిపించుకోవచ్చని.. నియమ నిబంధనలకు లోబడి.. సభ సంప్రదాయాలను పాటించాలన్నారు. ప్రతి రోజు సభ సజావుగా జరగకుండా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ రభస చేయడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యుల చర్యలు హేయమైన, హీనమైనవన్నారు. తాను స్పీకర్‌గా బాధతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను అన్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభకు సహకరించాలని.. ఈ విధంగా చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం తనకు బాధగా ఉందని.. తాను కూడా మానసికంగా మదనపడుతుంటాను అన్నారు. తనకు నిద్ర కూడా పట్టదని.. ఏపీ చేయలని పరిస్థితుల్లోనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకనే సభ్యులు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.