యాప్నగరం

శాసన మండలి నిర్ణయాలు పట్టించుకోనక్కర్లేదు.. స్పీకర్‌ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

ఏపీ శాసన మండలి వ్యవహారాలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 20 Jun 2020, 7:20 pm
రాష్ట్రాల విషయంలో అసెంబ్లీ నిర్ణయాలే అంతిమమని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూలే విగ్రహానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ మార్గాని భరత్ రామ్ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం స్పీకర్‌ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. మండలి నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పెద్దల సభలో ద్రవ్య వినిమయ బిల్లును సైతం అడ్డుకున్నారని విమర్శించారు.
Samayam Telugu స్పీకర్ తమ్మినేని సీతారాం


టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శాసన మండలిలో టీడీపీ నేత తీరును ఆయన ఎండగట్టారు. మండలిలో నిర్ణయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, శాసనసభ నిర్ణయమే అంతిమం అని తేల్చిచెప్పారు.

ఇద్దరు బీసీ నేతలకు పార్లమెంట్ పదవులు ఇచ్చి గౌరవించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి‌ స్పీకర్ తమ్మినేని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విశాఖపట్నం కచ్చితంగా రాజధాని అవుతుందని చెప్పారు. మూడు రాజధానులతో వచ్చే ఇబ్బంది ఏంటని తమ్మినేని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ప్రతిపక్షానికి ఇష్టం లేదా అని సభాపతి ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.