యాప్నగరం

18న క్యాబినెట్, 20న అసెంబ్లీ.. రాజధానిపై జగన్ స్ట్రాటజీ అదుర్స్

ఏపీ రాజధాని విషయమై ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతి రైతుల ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధాని అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 11 Jan 2020, 6:28 pm
ఏపీ రాజధాని విషయమై ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతి రైతుల ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధాని అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Samayam Telugu ap assembly special meeting three capitals issue on january 20
18న క్యాబినెట్, 20న అసెంబ్లీ.. రాజధానిపై జగన్ స్ట్రాటజీ అదుర్స్


​​రాజధానిపై స్పష్టత.!

అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఈ నెల 18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ భేటీలో చర్చ అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధానిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: బాబోయ్..! అమ్మ ఒడి ఎఫెక్ట్ మామూలుగా లేదుగా.. డబ్బుల కోసం జనం బారులు

​జీఎన్ రావు కమిటీ నివేదిక..

ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలు అందజేశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు చూపింది. ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని అభిప్రాయపడిన కమిటీ.. రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించింది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఏర్పాటుపై కీలక సూచనలు చేసింది.

​బోస్టన్ గ్రూప్ రిపోర్ట్..

మూడు రాజధానుల ప్రతిపాదనలకు అనుకూలంగానే బోస్టన్ గ్రూప్ రిపోర్ట్ అందజేసింది. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. విశాఖలో సీఎం, గవర్నర్ ఆఫీస్‌లు, సచివాలయం, హైకోర్టు బెంచ్.. కర్నూలులో హైకోర్టు, పలు కార్యాలయాల ఏర్పాటుకు సూచించింది. రెండో ఆప్షన్‌లో‌నూ అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకే మొగ్గు చూపింది. విశాఖలో సీఎం, గవర్నర్ కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ, సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సిఫార్సులు చేసింది.

​మంత్రులతో హై పవర్ కమిటీ..

జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్టులను అధ్యయనం చేసేందుకు క్యాబినెట్ మంత్రులతో నియమించిన హై పవర్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఇప్పటికే సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన హై పవర్ కమిటీ రెండుసార్లు భేటీ అయింది. తొలి సమావేశంలో జీఎన్ రావు కమిటీ, బీసీజీ ప్రతినిధులతో భేటీ అయిన హై పవర్ కమిటీ.. రెండో సమావేశంలో ఉద్యోగులకు కల్పించాల్సిన వసతులపై ప్రధానంగా చర్చించింది. ఈ నెల 13న మరోసారి సమావేశం కానుంది. క్యాబినెట్ భేటీ నివేదిక అందజేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.

​నెక్ట్స్.. అసెంబ్లీ..!

నెక్ట్స్.. అసెంబ్లీ..!

హై పవర్ కమిటీ నివేదిక అందజేసిన వెంటనే క్యాబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. నివేదికపై తక్షణం క్యాబినెట్‌లో చర్చించి రాజధానిపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఆ వాదనలకు బలం చేకూరుస్తోంది. క్యాబినెట్ భేటీలో చర్చించిన వెంటనే అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయడమే వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.