యాప్నగరం

25 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. వెంటనే వాయిదా

అసెంబ్లీ ఆలస్యంగా ప్రారంభం కావడం గతంలో ఎన్నడూ లేదని ప్రతిపక్ష టీడీపీ అంటోంది. అసెంబ్లీలో ముందుగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఎస్పీ బాలుతో పాటూ పలువురు ప్రజా ప్రతినిధుల మృతిపై సంతాపాన్ని తెలియజేశారు.

Samayam Telugu 30 Nov 2020, 10:19 am
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 25 నిమిషాల ఆలస్యంగా సభ ప్రారంభంకాగా.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సమయాని కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. ఇలా అసెంబ్లీ ఆలస్యంగా ప్రారంభం కావడం గతంలో ఎన్నడూ లేదని ప్రతిపక్ష టీడీపీ అంటోంది. అసెంబ్లీలో ముందుగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్‌, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, మోచర్ల జోహార్‌, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, సత్యప్రభలకు శాసనసభ సంతాపం తెలిపింది. తీర్మానాలను ఆమోదించిన తర్వాత కొద్ది సేపు విరామంతో సభను వాయిదా వేశారు.
Samayam Telugu ap assembly starts lately and adjourned after condolence motions
25 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. వెంటనే వాయిదా


అంతకముందు అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ధర్నా చేపట్టింది. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. తడిచిన వరి కంకులతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వచ్చారు.. అసెంబ్లీకి కాలినడకన చేరుకున్నారు. 20 అంశాలపై సమగ్ర చర్చ జరగాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. ఉపాధి హమీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణి, ఇసుక పాలసీ.. ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక ఎన్నికలపై చర్చించాలన్నారు. మరోవైపు వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ప్రకటించింది. టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు వాయిదా తీర్మానం ఇచ్చారు. తుపాను సందర్భంగా రైతులను అప్రమత్తం చేయడంలో.. ప్రభుత్వం విఫలమయ్యిందని తీర్మానంలో టీడీపీ పేర్కొంది. రైతులను ఆదుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.