యాప్నగరం

కన్నా లక్ష్మీనారాయణ కోడలి అనుమానాస్పద మరణం

హైదరాబాద్ మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రికి చేరుకునే లోపే కన్నుమూశారు.

Samayam Telugu 28 May 2020, 8:12 pm
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించగా.. ఆమెను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్థారించారు.
Samayam Telugu కన్నా కోడలి మరణం


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన సుహారిక కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య.

సుహారిక మరణం చుట్టూ అనుమానాలు మొదలయ్యాయి. ఆమె మరణానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. మాదాపూర్ డీసీపీ రంగంలోకి దిగారు. కన్నా కోడలి స్నేహితురాలిని ప్రశ్నించే పనిలో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఎక్కడ ఉన్నారన్నది క్లారిటీ రాలేదు.. దీనిపై కన్నా కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.