యాప్నగరం

'ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇదా'

'150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృతిమకొరత సృష్టించి రూ.150 కూలీ కూడా రాని పరిస్థితికి భవననిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు' వైఎస్సార్‌సీపీ సర్కార్‌ను టార్గెట్ చేసిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

Samayam Telugu 28 Oct 2019, 6:04 pm
ఏపీలో పాగా వేసేందుకు ఉత్సాహంతో ఉంది బీజేపీ. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీతో పాటూ మిగిలిన పార్టీల నుంచి నేతల్ని పార్టీలోకి చేర్చుకుంటోంది. ముఖ్యంగా టీడీపీ నుంచి కమలం పార్టీలోకి వలసలు షురూ అయ్యాయి. కొద్ది రోజుల క్రితమే రాయలసీమ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరు నేతలు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వలసలతో పాటూ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది బీజేపీ. అంశాల వారీగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.
Samayam Telugu bjp.


తాజాగా జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. స్కూల్, పంచాయతీ భవనాలు.. వాటర్ ట్యాంకులకు వైఎస్సార్‌సీపీ జెండా రంగులు వేయడం, ఇసుక కొరతపై ట్వీట్ చేశారు. ‘రంగులేసుకోవడానికి,ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసీపీ. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృతిమకొరత సృష్టించి రూ.150 కూలీ కూడా రాని పరిస్థితికి భవననిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు’అంటూ మండిపడ్డారు.
కన్నా గతంలో కూడా వైఎస్సార్‌సీపీ సర్కార్‌పై విమర్శలు చేశారు. పోలవరం, రాజధాని అంశంతో పాటూ ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై స్పందిస్తున్నారు. తాజాగా స్కూల్, పంచాయతీ భవనాలు.. వాటర్ ట్యాంకులకు వైఎస్సార్‌సీపీ జెండా రంగులు వేయడంపై మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.