యాప్నగరం

అరబిందోకు 108 కాంట్రాక్ట్‌.. విజయసాయి అల్లుడికి వాటాలు: కన్నా సంచలన లేఖ

2018లో BVG సంస్థతో ఐదేళ్ల కాలానికి నెలకు రూ.1.31 లక్షలతో చేసుకున్న ఒప్పందం ఎందుకు రద్దైందని.. తక్కువ ధరకు వచ్చే సేవల్ని ఎందుకు రద్దు చేసి, భారీగా ధరలు పెంచి కొత్త వారికి అప్పగించారో సీఎం సమాధానం చెప్పాలన్నారు.

Samayam Telugu 16 Jun 2020, 7:16 am
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. 108 అంబులెన్స్ సేవల కోసం అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఎంపికను ప్రశ్నించిన ఆయన.. కొత్త అంబులెన్సుల సేవల కోసం నెలకు ఒక్కోదానికి రూ.1.78లక్షలు.. పాత వాటికి రూ.2.21లక్షల చెల్లింపుపై ప్రశ్నించారు. 2018లో BVG సంస్థతో ఐదేళ్ల కాలానికి నెలకు రూ.1.31 లక్షలతో చేసుకున్న ఒప్పందం ఎందుకు రద్దైందని.. తక్కువ ధరకు వచ్చే సేవల్ని ఎందుకు రద్దు చేసి, భారీగా ధరలు పెంచి కొత్త వారికి అప్పగించారో సీఎం సమాధానం చెప్పాలన్నారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి


ఈ 108 కాంట్రాక్టుల్లో ఎంపీ విజయ సాయిరెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి పాత్ర తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నష్టం చేసే కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలన్నారు. అరబిందో ఫౌండేషన్ మాతృ సంస్థ అయిన అరబిందో ఫార్మాలో విజయ సాయి రెడ్డి అల్లుడికి పెద్ద ఎత్తున వాటాలున్నాయి.. ప్రభుత్వానికి నష్టం చేసే కాంట్రాక్టు తక్షణం రద్దు చేయాలన్నారు. కన్నా రాసిన ఈ లేఖ ఆసక్తికరంగా మారింది. ఈ లేఖపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.