యాప్నగరం

ఏపీలో వ్యాక్సిన్ పాలిటిక్స్.. జగన్ సర్కారుపై బీజేపీ గుర్రు.. సీఎం సొంత జిల్లాలోనే ఇలా..

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ప్రారంభం అవుతున్న వేళ జగన్ సర్కారుపై బీజేపీ గుర్రుగా ఉంది. కడప జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టరుపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని తప్పుబట్టింది.

Samayam Telugu 16 Jan 2021, 11:22 am
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా 3 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఆ తర్వాతి దశలో 30 కోట్ల మందికి టీకా వేయిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఏపీ విషయానికి వస్తే.. తొలి దశలో 3.87 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ కోసం ఏపీ సర్కారు సన్నద్ధమైంది.
Samayam Telugu corona vaccination in ap


కాగా వ్యాక్సినేషన్ కోసం కడప జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోస్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడం పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం సొంత జిల్లాలో ఇలా జరగడాన్ని కమలం పార్టీ ఖండించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్న తరుణంలో.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మోదీ ఉపన్యాసాలను అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రదర్శిస్తున్నాయని సోము వీర్రాజు తెలిపారు.

ఇలాంటి సమయంలో కడపలో నిర్వహించే కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన పోస్టర్‌లో ప్రధాని ఫొటో కూడా లేకపోవడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ తప్పుబట్టారు. ప్రధాని మోదీ ఫొటో వేయకుండా అలసత్వం వహించిన సంబంధిత అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.