యాప్నగరం

ఫోన్ చేస్తే సాయం.. ఏపీ బీజేపీ వినూత్న కార్యక్రమం

Coronavirus: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ బీజేపీ హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చింది. ప్రజలకు ఏ సాయం కావాలన్నా ఫోన్ చేయాలని సూచించింది.

Samayam Telugu 28 Mar 2020, 5:35 pm
కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పనుల్లేక రోజువారీ కూలీలు, నిరుపేదలు, యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ శాఖ సైతం వినూత్న కార్యక్రమం చేపట్టింది.
Samayam Telugu bjp-logo


ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ ఎదుర్కోవడానికి ఏపీ బీజేపీ హెల్ప్ లైన్ నంబర్ విడుదల చేసింది. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా 8142266266 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ఏపీ బీజేపీ శాఖ శనివారం ట్వీట్ చేసింది. ఎవరికి ఏ సమయంలో సాయం కావాలన్నా తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. కరోనాపై పోరాటంలో ప్రజలకు ఎలాంటి సాయం కావాలన్న తక్షణమే అందిస్తామని స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో నాలుగు, విజయవాడలో మూడు, గుంటూరులో రెండు, నెల్లూరులో ఒకటి, ఒంగోలులో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, తిరుపతిలో ఒకటి చొప్పున మొత్తం 13 కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.