యాప్నగరం

వైసీపీతో మాకు దోస్తీ ఏంటి?.. ఏపీ బీజేపీ ఇంఛార్జ్ ఆసక్తికర వ్యాఖ్యలు

'ప్రధాని మోదీ-జగన్‌ల భేటీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్సార్‌సీపీతో మాకు దోస్తీ లేదు.. మేము జనసేనతో కలిసి ముందుకు సాగుతున్నాం. వైఎస్సార్‌సీపీ మాకు రాజకీయ ప్రత్యర్థి' సునీల్ దియేధర్.

Samayam Telugu 15 Feb 2020, 3:09 pm
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిరేపింది. వైఎస్సార్‌సీపీ-బీజేపీల మధ్య దోస్తీ అంటూ ప్రచారం మొదలయ్యింది.. ఏకంగా జగన్ పార్టీ కేంద్రంలో చేరబోతున్నట్లు ఊహానాలు వినిపించాయి. అందుకే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలను కలిశారంటూ టాక్ వినిపించింది.
Samayam Telugu sunil


Read Also: బీజేపీతో వైసీపీ దోస్తీపై ప్రచారం.. కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్సార్‌సీపీతో పొత్తు అంశంపై ఏపీ బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియేధర్ ఈ అంశంపై మాట్లాడారు. వైఎస్సార్‌సీపీతో తమకు పొత్తు లేదన్నారు. జనసేనతో మాత్రమే పొత్తు ఉందని.. మేం ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీలు తమకు రాజకీయ ప్రత్యర్థులని.. జనసేనతో కలిసి వైసీపీ విధానాలపై పోరాటం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారితో కలిసి పోటీచేస్తామన్నారు.

వైఎస్సార్‌సీపీ, టీడీపీలు చాలా ప్రమాదకరమైన పార్టీలు అన్నారు సునీల్. ప్రధాని మోదీ-సీఎం జగన్‌ల భేటీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నటుడిగా ఉండి రాజకీయ నాయకుడు అయ్యారని.. చంద్రబాబు రాజకీయ నేత నుంచి నటుడిగా మారుతున్నారు అంటూ సెటైర్లు పేల్చారు. ఏపీ ఆర్థిక పరిస్థితి రోజు దిగజారిపోతోందన్నారు. తాము అమరావతికి అనుకూలమన్న దియేధర్.. రాజధాని అంశం మాత్రం రాష్ట్ర పరిధిలోనిదని సునీల్ అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.