యాప్నగరం

చంద్రబాబుకు ద్వారాలు మూసుకుపోయాయ్! బీజేపీ ఏపీ ఇన్చార్జి సంచలన వ్యాఖ్యలు

రానున్న స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎవ్వరితోనూ పొత్తులు ఉండవు. ఏ పార్టీతోనూ కలిసి నడిచే ఆలోచన లేదని ఆ పార్టీ ఏపీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు.

Samayam Telugu 13 Oct 2019, 5:49 pm
కేంద్ర ప్రభుత్వంతో విభేదించి ఎన్డీయే నుంచి బయటకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ టార్గెట్ చేసింది. అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని, పోలవరం టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశంతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందని, దశాబ్దాలుగా కమలం పార్టీ ఎదగకుండా చంద్రబాబు అడ్డుకుంటూ వచ్చారని విమర్శలు చేశారు.
Samayam Telugu chandrababu-naidu


ఇప్పటి వరకూ ఉప్పూ నిప్పుగా ఉన్న బీజేపీ, టీడీపీ మళ్లీ మైత్రిబంధం కలవనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంతో విభేధించి నష్టపోయామని, పట్టుదలకు పోకుండా ఉంటే అంత ఇబ్బందులు వచ్చేవి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి లాభం జరగలేదన్నారు.

Also Read: వైఎస్ వివేకా హత్య కేసు: కడప ఎస్పీ వార్నింగ్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్‌తో హుందాగా ఉండాలనే గాజువాకలో ఎన్నికల ప్రచారానికి రాలేదన్నారు. ఆయనతో లాలూచీ వ్యవహారాలు ఏం లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేనను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు ఓటమికి కారణాలు తెలియడం లేదంటూ చెప్పుకొచ్చిన బాబు.. తాజా వ్యాఖ్యలతో కొత్త రాజకీయ సమీకరణాలకు పునాదులు పడుతున్నాయా? మరోసారి బీజేపీతో కలిసి వెళ్లడానికి బాబు ప్రయత్నిస్తున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: అప్పుడు ఎన్టీఆర్‌ది.. ఇప్పుడు వైఎస్సార్ వంతు..

ఇంతలోనే బీజేపీ ఏపీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదన్నారు. టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ ఎవ్వరితోనూ కలిసి నడిచే అవకాశం లేదన్నారు. రానున్న స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని దేవధర్ చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసిందని గుర్తు చేశారు. టీడీపీకి ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయాయని, మళ్లీ తెరుచుకునే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.