యాప్నగరం

ఏపీ ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ లేఖ... వైసీపీపై ఫిర్యాదు

ఒక్కొ కుటుంబానికి రూ.1000 నగదు అందిస్తున్నారు. వెయ్యి రూపాయల ఆర్థికసాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ. వైసీపీ అభ్యర్థులపై అనర్హత వేటు వేయండి.

Samayam Telugu 5 Apr 2020, 3:19 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నుంచి నగదు పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వ్యప్తి కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో బియ్యం కార్డు లబ్దిదారులకు ఏపీలో నగదు పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఒక్కొ కుటుంబానికి రూ.1000 నగదు అందిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఏపీ బీజేపీ అగ్రనేత కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. పేదలకు ప్రకటించిన వెయ్యి రూపాయల ఆర్థికసాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని తన లేఖలో ఆరోపించారు. ఆ డబ్బును వైసీపీ పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీంతో వైసీపీ అభ్యర్థులపై అనర్హత వేటు వేసి జైలు శిక్ష విధించాలని కోరారు. ఇలాంటి సంక్షోభ సమయంలో స్వార్థ రాజకీయాలు తగవని వైసీపీకి హితవు పలికారు కన్నా.
Samayam Telugu ramesh-kumar-andhra-ec-bccl


మరోవైపు ఇదే విషయమై అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా అనేక ఆరోపణలు చేస్తోంది. కేంద్రం బియ్యం, కందిపప్పు, నగదు సరఫరా చేస్తే జగన్ దాన్ని డెలివరీ చేస్తున్నారంటూ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీకి చెందిన మరికొందరు నాయకులు కూడా నగదు పంపిణీ కార్యక్రమంపై ఆరోపణలు చేశారు.తాజాగా మరి ఏపీ బీజేపీ నేత కన్నా కూడా స్పందించడడంతో దీనిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే, ఇప్పటికే జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వ్యక్తిగత పథకాలకు నిషేధం వర్తిస్తుందని, ప్రభుత్వ దైనందిన కార్యక్రమాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపారు. కావాల్సిన చోట రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం స్పష్టత కూడా ఇస్తుందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.